యాప్నగరం

‘అగ్గి’ధార: రగిలిన వంశధార నిర్వాసితులు

శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పదేళ్ల నుంచి నష్టపరిహారం

Samayam Telugu 23 Jan 2017, 9:20 am
శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పదేళ్ల నుంచి నష్టపరిహారం ఇవ్వకపోవడంతో ప్రాజెక్టు పనులు చేపట్టిన సోమ కంపెనీపై దాడి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు చేపడుతున్న హీరాలో ఆదివారం 29గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
Samayam Telugu evacuees set fire on govt assets at vamshadhara project in hira
‘అగ్గి’ధార: రగిలిన వంశధార నిర్వాసితులు


సోమ కంపెనీ, ఇతర ప్రభుత్వ వాహానాలకు నిప్పంటించారు. కర్రల, బరిసెలు చేతపట్టి ప్రజలు ఈ దాడి చేశారు.

వంశధార ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు 6వేల ఎకరాల భూమి రైతుల నుంచి సేకరించింది. అయితే రైతులకు ఇంతవరకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించలేదు.

ప్రభుత్వం ఇందుకోసం విడుదల చేసిన రూ.450కోట్లు ఇంత వరకు బాధితులకు చేరలేదు. దీంతో ప్రాజెక్టు వల్ల పంటపొలాలు, ఇళ్లు, ఇతర స్థలాలు కోల్పోయిన 29 గ్రామాల ప్రజలు ఏకమై ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళ నిర్వహించారు.

తమకు నష్టపరిహారం చెల్లించకపోతే ప్రాజెక్టును ముందుకు సాగనివ్వబోమని హెచ్చరించిన బాధితులు..తమ భూములు తమకు తిరిగివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.