యాప్నగరం

వైసీపీలో చేరిన మాజీ సీఎం కుమారుడు

ప్రజలకు రాజకీయ నాయకులపై అభిమానం, నమ్మకం ఉండాలని.. ఆ ఘనతను దివంగత నేత రాజశేఖర్‌ రెడ్డి సాధ్యం చేశారు. మళ్లీ ప్రజలకు రాజకీయ నాయకులపై నమ్మకం రావాలంటే అది జగన్‌తోనే సాధ్యం అని రామ్ కుమార్ రెడ్డి అన్నారు.

Samayam Telugu 8 Sep 2018, 5:16 pm
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్‌ కుమార్‌ శనివారం (సెప్టెంబరు 8) వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖ జిల్లా పెందూర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ రామ్‌కుమార్‌ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ అనుచరులు కూడా వైసీపీ గూటికి చేరారు.
Samayam Telugu NRamkumar


ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు రాజకీయ నాయకులపై అభిమానం, నమ్మకం ఉండాలని.. ఆ ఘనతను దివంగత నేత రాజశేఖర్‌ రెడ్డి సాధ్యం చేశారన్నారు. మళ్లీ ప్రజలకు రాజకీయ నాయకులపై నమ్మకం రావాలంటే అది జగన్‌తోనే సాధ్యమన్నారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు అన్ని విధాలా మోసపోయారని.. ఈ సారి వైఎస్‌ జగన్‌కు అవకాశమివ్వడానికి ఎదురు చూస్తున్నారని అన్నారు.

వైసీపీలో చేరిన రాంకుమార్ రెడ్డికి వెంకటగిరి ఎమ్మేల్యే టికెట్ లేదా విశాఖపట్నం ఎంపీ టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వెంక‌టిగిరి అసెంబ్లీ స్థానంపై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి హామీ ఇచ్చిన పక్షంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.