యాప్నగరం

ప్రకాశం పర్యటనలో సీబీఐ మాజీ జేడీ కీలక వ్యాఖ్యలు!

ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రస్తుతం ప్రజా సమస్యల అధ్యయనానికి ఏపీలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

Samayam Telugu 21 May 2018, 12:58 pm
ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రస్తుతం ప్రజా సమస్యల అధ్యయనానికి ఏపీలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి తొలుత తన పర్యటన ప్రారంభించిన ఆయన, ఆదివారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా చీరాలలో రైతులతో సమావేశమై వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడం అందరి కర్తవ్యమని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. రైతు లేనిదే దేశానికి మనుగడలేదని, వారి సమస్యలు తీరే సమయం దగ్గరకొచ్చిందని ఉద్ఘాటించారు. దాదాపు 28 ఏళ్ల నా ఉద్యోగ జీవితంలో ప్రజలు, అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించానని, ప్రస్తుతం వాటిని స్వయంగా విని పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే జిల్లాల్లో పర్యటిస్తున్నానని తెలిపారు.
Samayam Telugu జేడీ లక్ష్మీ నారాయణ


ఇందులో భాగంగానే చిన గంజాంలో ఉప్పు రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ఓ కమిటీని ఏర్పాటుచేసినట్టు తెలియజేశారు. అలాగే తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే సమయమెచ్చిందని వ్యాఖ్యానించిన ఆయన, రైతు సమస్యల పరిష్కారానికి చొరవ చూపడమే తన లక్ష్యమని వెల్లడించారు. లక్ష్మీ నారాయణకు తమ సమస్యలు ఏకరవు పెట్టిన రైతులు, పంటలను తక్కువ ధరలకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. హోల్ సేల్ వ్యాపారులకు తాము పంటను విక్రయిస్తుంటే, తమకు తక్కువ ధర ఇచ్చి, బహిరంగ మార్కెట్ లో దళారులు అధిక ధరలతో వాటిని ప్రజలకు అమ్ముతున్నారని రైతులు ఆరోపించారు. అంతకు ముందు వినోదరాయునిపాలెంలో పర్యటించిన లక్ష్మీనారాయణ టంగుటూరి ప్రకాశం పంతులు 57 వర్దంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.