యాప్నగరం

వైసీపీలోకి ప్రకాశం జిల్లా మాజీ మంత్రి..!

ప్రకాశం జిల్లాకి చెందిన మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కందుకూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు కాంగ్రెస్

Samayam Telugu 8 Jul 2018, 10:48 am
ప్రకాశం జిల్లాకి చెందిన మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కందుకూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన మహీధర్‌ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే.. రాష్ట్ర విభజన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికలకి దూరంగా ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతాడనే వార్తలు వచ్చాయి. కానీ.. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 11న వైసీపీలో చేరబోతున్నట్లు మహీధర్‌ రెడ్డి ప్రకటించారు.
Samayam Telugu 636666153964171255


పాదయాత్రలో ఉన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో రానున్న బుధవారం ఉదయం 9 గంటలకి పార్టీలో చేరనున్నట్లు మహీధర్‌ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని.. అందుకే ప్రజల ఆకాంక్ష మేరకు తాను వైసీపీలో చేరుతున్నట్లు ఆయన వివరించారు. మీడియా సమావేశంలో ఆయనతో పాటు వైసీపీ సీనియర్‌ నేత విజయసాయి మాట్లాడుతూ.. మహీధర్‌ రెడ్డి పార్టీలో చేరుతుండటం ఆనందంగా ఉందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.