యాప్నగరం

ఆపరేషన్ ద్రవిడ సంగతి తేల్చాలి.. డీజీపీకి మాజీ మంత్రి ఫిర్యాదు

ఆపరేషన్ ద్రవిడ... ఏపీలో హాట్‌టాపిక్‌గా మారిన అంశం ఇదే. హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు... ఆయన విడుదల చేసిన వీడియో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ వ్యవహారంపై బీజేపీ కూడా స్పందించింది. దీనికి వెనుక ఎవరున్నారో తేల్చాలంటూ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు డీజీపీకి ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 24 Mar 2018, 4:02 pm
ఆపరేషన్ ద్రవిడ... ఏపీలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిన అంశం ఇదే. హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు... ఆయన విడుదల చేసిన వీడియో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ వ్యవహారంపై బీజేపీ కూడా స్పందించింది. దీనికి వెనుక ఎవరున్నారో తేల్చాలంటూ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఓ లేఖ కూడా రాశారు. ఆపరేషన్ ద్రవిడ పేరుతో కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలు ప్రజల్లో పోవాలంటే విచారణ జరిపించాలని ఆయన కోరారట. శివాజీ మాటల ప్రకారం ఏపీలో అరాచకాలు, కుట్రల జరుగుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని.... అందుకే దీనికి వెనుక ఎవరి హస్తం ఉందో ప్రజలకు తెలియాలన్నారు.
Samayam Telugu Manikyala Rao


ఆపరేషన్ ద్రవిడ కోసం రూ.4800 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ శివాజీ చేసిన వ్యాఖ్యల్ని కూడా లేఖలో మాణిక్యాలరావు ప్రస్తావించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని లేఖలో డీజీపీని కోరానని చెప్పారు. మొత్తం మీద ఈ ఆపరేషన్ ద్రవిడ వ్యవహారానికి ఇప్పట్లో పుల్‌స్టాప్ పడే అవకాశం కనిపించడం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.