యాప్నగరం

ప్రశ్నించడమే తప్పా.. కార్తీక్ కోసం ఎంత దూరమైనా వెళతా: లోకేష్ ట్వీట్

జగన్ గారూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు నొక్కాలని చూస్తే అది ఒక విప్లవానికి నాంది పలుకుతుంది. మీ ప్రభుత్వాన్ని ఎండగడుతుంటే.. కేసులతో గొంతు నొక్కాలని చూస్తారా..

Samayam Telugu 7 Jul 2019, 5:40 pm
టీడీపీ కార్యకర్తలపై దాడులు, తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తోంది టీడీపీ. ఆ పార్టీ నేతలు డీజీపీని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఈ వ్యవహారంపై ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. తాజాగా ఓ టీడీపీ కార్యకర్తపై కేసు వ్యవహారం ఏపీలో హాట్‌టాపిక్ అయ్యింది. వైసీపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ ఓ యువకుడిపై కేసు నమోదయ్యిందట. ప్రభుత్వంలో తప్పులు గురించి ప్రశ్నించడం యువకుడు చేసిన తప్పా అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. టీడీపీ కార్యకర్త కార్తీక్‌కు అండగా ఉంటానన్నారు.
Samayam Telugu lokesh


లోకేష్ తన ట్వీట్‌లో ‘జగన్ గారూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు నొక్కాలని చూస్తే అది ఒక విప్లవానికి నాంది పలుకుతుంది. ఒక సామాన్య పౌరుడు అయిన కార్తీక్ మీ ప్రభుత్వాన్ని ఎండగడుతుంటే అతనిని కేసుల పేరుతో వేధింపులకు గురి చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కార్తీక్‌కు మేము అండగా నిలబడతాం.. #WeAreWithKarthik’అంటూ హ్యాష్ ట్యాగ్ చేశారు.
మరో ట్వీట్‌లో ‘కార్తీక్‌కు అన్ని సహాయాలు అందించే బాధ్యత నేను స్వయంగా తీసుకుంటా.. ఇది ఎక్కడి వరకైతే అక్కడ వరకు అతనికి తోడుగా ఉంటా !’ అంటూ లోకేష్ భరోసా నింపే ప్రయత్నం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.