యాప్నగరం

జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు

జనసేనకు జైకొట్టిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు. విజయవాడలో పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్న బాలరాజు.

Samayam Telugu 10 Nov 2018, 2:23 pm
కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేనకు జై కొట్టారు. శనివారం విజయవాడలో అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకొన్నారు. ఏజెన్సీ ప్రాంతానికి బాలరాజు చేస్తున్న సేవలు నచ్చే పార్టీలోకి ఆహ్వానించామన్నారు జనసేనాని. విశాఖ ఏజెన్సీ పరిస్థితులు ఆయనకు పూర్తిగా తెలుసన్నారు. జనసేనలో చేరడం ఆనందంగా ఉందన్నారు బాలరాజు. పవన్ పర్యటనతోనే ఏజెన్సీలో జరుగుతున్న దోపిడీ బయటపడిందని.. ఆయన ధైర్యంగా ప్రభుత్వ దోపిడీని ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పవన్‌తో కలిసి పనిచేస్తానని.. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.
Samayam Telugu Balaraju


బాలరాజు చేరిక తర్వాత మాట్లాడిన పవన్.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చామన్నారు. కాని టీడీపీ ప్రభుత్వానికి స్వప్రయోజనాలే ముఖ్యమయ్యాయని విమర్శించారు. విశాఖ పోర్టు అడ్డాగా మైనింగ్‌ జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. మైనింగ్‌లో దివంగత సీఎం వైఎస్ చేసిన తప్పును టీడీపీ కొనసాగిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు తప్పులన్నీ తెలసి కూడా సైలెంట్‌గా ఉన్నారంటే అర్థమేంటని ప్రశ్నించారు.

తెలంగాణ ఎన్నికల్లో పోటీపై..
తెలంగాణ ఎన్నికల్లో పోటీపై నేతలతో చర్చించి.. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు పవన్. ముందస్తు ఎన్నికలు కాకుండా వచ్చే ఏడాదే ఎన్నికలొస్తే 23 అసెంబ్లీ.. మూడు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేయాలని భావించామన్నారు. ముందస్తు ఎన్నికలు రావడం, సరైన సన్నద్ధత లేకపోవడంపై పోటీపై సమాలోచనలు చేస్తున్నామన్నారు. కొంత మంది స్వతంత్రంగా నిలబడతామని.. తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారని పవన్‌ చెప్పుకొచ్చారు. అన్ని అంశాలపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.