ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి శైలజానాథ్ కలిశారు. అమరావతిలోని సెక్రటేరియెట్కు వెళ్లిన ఆయన సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే సమస్యలు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ ఆస్పత్రుల్లో.. ఎన్టీఆర్ వైద్యసేవా పథకం అమలు కావడం లేదని సీఎంకు వివరించారట. అలాగే తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. బాబుతో భేటీ తర్వాత స్పీకర్ కోడెలను కూడా శైలజానాథ్ కలిశారు.
ఉన్నట్టుండి శైలజానాథ్ చంద్రబాబును కలవడంతో రాజకీయంగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఏకంగా టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. దీంతో ఆయన స్పందించారు. సీఎంతో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని.. రాజకీయాలపై ఎలాంటి చర్చా జరగలేదన్నారు. కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడానికి మాత్రమే వచ్చానన్నారు. ప్రజా సమస్యలపై కలిస్తే తప్పేంటన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని వీడనని.. 2019లో కూడా ఆ పార్టీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
ఉన్నట్టుండి శైలజానాథ్ చంద్రబాబును కలవడంతో రాజకీయంగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఏకంగా టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. దీంతో ఆయన స్పందించారు. సీఎంతో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని.. రాజకీయాలపై ఎలాంటి చర్చా జరగలేదన్నారు. కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడానికి మాత్రమే వచ్చానన్నారు. ప్రజా సమస్యలపై కలిస్తే తప్పేంటన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని వీడనని.. 2019లో కూడా ఆ పార్టీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.