యాప్నగరం

చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి శైలజానాథ్

ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి శైలజానాథ్ కలిశారు. అమరావతిలోని సెక్రటేరియెట్‌కు వెళ్లిన ఆయన సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే సమస్యలు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 18 Jul 2018, 2:26 pm
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి శైలజానాథ్ కలిశారు. అమరావతిలోని సెక్రటేరియెట్‌కు వెళ్లిన ఆయన సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే సమస్యలు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ ఆస్పత్రుల్లో.. ఎన్టీఆర్ వైద్యసేవా పథకం అమలు కావడం లేదని సీఎంకు వివరించారట. అలాగే తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. బాబుతో భేటీ తర్వాత స్పీకర్ కోడెలను కూడా శైలజానాథ్ కలిశారు.
Samayam Telugu Sailajanath


ఉన్నట్టుండి శైలజానాథ్ చంద్రబాబును కలవడంతో రాజకీయంగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఏకంగా టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. దీంతో ఆయన స్పందించారు. సీఎంతో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని.. రాజకీయాలపై ఎలాంటి చర్చా జరగలేదన్నారు. కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడానికి మాత్రమే వచ్చానన్నారు. ప్రజా సమస్యలపై కలిస్తే తప్పేంటన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని వీడనని.. 2019లో కూడా ఆ పార్టీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.