యాప్నగరం

ఎవర్నీ బెదిరించలేదు.. అధికారితో ఉన్న చనువుతో అలా మాట్లాడా: వసంత నాగేశ్వరరావు

పంచాయతీ కార్యదర్శిని బెదిరించారన్న ఆరోపణలపై స్పందించిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు. హత్యా రాజకీయాలు చేసేదెవరో తెలుసంటూ మంత్రి దేవినేని ఉమకు కౌంటర్.

Samayam Telugu 10 Sep 2018, 9:12 pm
ఏ అధికారిని బెదిరించే ఉద్దేశం తనకు లేదంటున్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు. పంచాయతీ కార్యదర్శిని బెదిరించిన ఘటనపై ఆయన స్పందించారు. గుంటుపల్లి గ్రామ కార్యదర్శి నరసింహారావుతో తనకు చనువు ఉందని.. అందుకే అలా మాట్లాడానన్నారు. ఎన్నికల్లో దేనికైనా సిద్ధమంటూ మామూలుగానే మాట్లాడానని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గ్రామంలో వైసీపీ ఫ్లెక్సీలను ఏకపక్షంగా తొలగించడాన్ని నరసింహారావు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశానే తప్ప.. ఎలాంటి దుర్దేశం లేదన్నారు. కార్యదర్శిని బెదిరించినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు.
Samayam Telugu Vasantha


హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు వసంత నాగేశ్వరరావు. హత్యా రాజకీయాలకు ఆజ్యం పోసింది ఎవరో అందరికి తెలుసన్నారు. మైలవరం నియోజకవర్గంలో అధికార బలంతో ఇష్టం వచ్చినట్లు చేస్తూ.. తనపై పంచాయతీ కార్యదర్శితో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. తన ఫోన్ సంభాషణను కూడా వక్రీకరించారని.. తన అనుమతి లేకుండా కాల్ రికార్డ్ చేయడం పద్దతి కాదన్నారు నాగేశ్వరరావు.

కృష్ణాజిల్లా గుంటుపల్లిలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ తొలగింపు విషయంలో పంచాయితీ కార్యదర్శికి రెండు రోజుల కిందట ఫోన్‌లో మాజీ మంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు బెదిరించినట్టు ఆడియో బయటపడింది. సదరు అధికారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదయ్యింది. దీంతో వసంత నాగేశ్వరరావు తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.