'ప్రజా సమస్యలు పట్టవా.. నిమ్మగడ్డను విడిపించమని వైసీపీ ఎంపీలు అడగటమేంటి'
రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా.. నిమ్మగడ్డ ప్రసాద్ను విడిపించమని వైసీపీ ఎంపీలు విదేశాంగ మంత్రిని అడగటం ఏంటి. వైసీపీ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసింది.
Samayam Telugu 31 Jul 2019, 3:11 pm
నిమ్మగడ్డ ప్రసాద్తో ఏపీ ముఖ్యమంత్రి జగన్కు ఉన్న వ్యాపార లావాదేవీలు ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. నిమ్మగడ్డ అరెస్ట్పై జగన్ స్పందించాలన్నారు. వాన్పిక్ కుంభకోణంలో వాస్తవాలను ప్రజలకు చెప్పాలన్నారు. ఇక సీబీఐ కేసు తేలకుండానే ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఎలా రిలీజ్ చేస్తారో చెప్పాలన్నారు. అంతర్జాతీయంగా అవినీతి కేసులలో జగన్ పేరు మార్మోగుతోందని సెటైర్లు పేల్చారు. బుధవారం మీడియాతో మాట్లాడిన యనమల జగన్పై మండిపడ్డారు.
కోర్టు అనుమతి తీసుకొని ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లడం రాష్ట్రానికే తలవంపులన్నారు యనమల. ఎంపీ విజయసాయి రెడ్డిని అయితే రూ.2 లక్షలు డిపాజిట్ కట్టి విదేశాలకు వెళ్లాలని కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. అలాంటి నేతల నోటి నుంచి నీతులు వినాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అవినీతి కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం, ఆస్తుల జప్తులతోనే వైసీపీ నేతలకు సమయం సరిపోతోందన్నారు.
వైసీపీ ఎంపీలు విదేశాంగ మంత్రిని కలిసి నిమ్మగడ్డ ప్రసాద్ను విడిపించాలని కోరడం ఏంటని యనమల ప్రశ్నించారు. తమ సమస్యల్ని పరిష్కరిస్తారని వైసీపీ ఎంపీల్ని ప్రజలు గెలిపించారని.. కేసుల్లో నిందితుల ప్రయోజనాల కోసం కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు. వైసీపీ ఎంపీలు విదేశాంగ మంత్రిని కలవడంతో.. జగన్తో నిమ్మగడ్డ వ్యాపార లావాదేవీలు ఉన్నాయనడానికి ప్రత్యక్ష సాక్ష్యమన్నారు.
వైసీపీ నేతల దెబ్బకు పరిశ్రమలు రాష్ట్రానికి రావడం లేదని.. వీరి బెదిరింపులతో పారిశ్రామిక వేత్తలు భయపడి పారిపోతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్, ఏపీఐఐబి వెనకడుగు వేశాయన్నారు. టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని.. వైసీపీ సర్కార్ దానిని చెడగొడుతుందన్నారు.
కోర్టు అనుమతి తీసుకొని ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లడం రాష్ట్రానికే తలవంపులన్నారు యనమల. ఎంపీ విజయసాయి రెడ్డిని అయితే రూ.2 లక్షలు డిపాజిట్ కట్టి విదేశాలకు వెళ్లాలని కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. అలాంటి నేతల నోటి నుంచి నీతులు వినాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అవినీతి కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం, ఆస్తుల జప్తులతోనే వైసీపీ నేతలకు సమయం సరిపోతోందన్నారు.
వైసీపీ ఎంపీలు విదేశాంగ మంత్రిని కలిసి నిమ్మగడ్డ ప్రసాద్ను విడిపించాలని కోరడం ఏంటని యనమల ప్రశ్నించారు. తమ సమస్యల్ని పరిష్కరిస్తారని వైసీపీ ఎంపీల్ని ప్రజలు గెలిపించారని.. కేసుల్లో నిందితుల ప్రయోజనాల కోసం కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు. వైసీపీ ఎంపీలు విదేశాంగ మంత్రిని కలవడంతో.. జగన్తో నిమ్మగడ్డ వ్యాపార లావాదేవీలు ఉన్నాయనడానికి ప్రత్యక్ష సాక్ష్యమన్నారు.
వైసీపీ నేతల దెబ్బకు పరిశ్రమలు రాష్ట్రానికి రావడం లేదని.. వీరి బెదిరింపులతో పారిశ్రామిక వేత్తలు భయపడి పారిపోతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్, ఏపీఐఐబి వెనకడుగు వేశాయన్నారు. టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని.. వైసీపీ సర్కార్ దానిని చెడగొడుతుందన్నారు.