యాప్నగరం

టీడీపీ నేతకు ఇంకో ఐదేళ్ల జైలు శిక్ష!

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే...

TNN 16 Nov 2017, 8:35 am
తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. నకిలీ డీడీల కుంభకోణంలో కందికుంటకు సీబీఐ కోర్టు ఈ శిక్షను విధించింది. కందికుంటతో పాటు ఈ స్కామ్ లో పలువురికి జైలు శిక్ష పడింది. వీరికి కోర్టు ఐదు లక్షల పదివేల రూపాయల జరిమానాను కూడా విధించింది. ఈ మేరకు నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో కందికుంటతో పాటు ఈ స్కామ్ కు సహకరించిన పోలీసుకు మూడు సంవత్సరాల పాటు, బ్యాంకు మేనేజర్ కు ఐదేళ్ల పాటు శిక్షను విధించింది కోర్టు.
Samayam Telugu ex mla gets five years imprisonment
టీడీపీ నేతకు ఇంకో ఐదేళ్ల జైలు శిక్ష!


అయితే కందికుంటకు ఈ శిక్ష మొదటిది కాదు. గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు నకిలీ డీడీల స్కామ్ లో కూడా ఈయనకు ఏడేళ్ల పాటు శిక్ష పడింది. వివిధ బ్యాంకులను ఇలా మోసం చేసిన కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు ఈ మాజీ ఎమ్మెల్యే. వాటిల్లో శిక్షలు పడుతూ వస్తున్నాయి.

ఇది వరకే ఒక కేసులో దోషిగా నిర్ధారణ అయ్యి ఏడేళ్లను శిక్షను ఎదుర్కొంటున్నా.. కందికుంట బెయిల్ పై బయటే ఉన్నారు. కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. అనంతపురం జిల్లా టీడీపీలో ముఖ్యనేతగా ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.