యాప్నగరం

టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన విశాఖజిల్లా నేత

విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపించిన కొద్దిసేపటికే వైసీపీలో చేరిపోయారు. కృష్ణా జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలిసి... పార్టీ కండువా కప్పుకున్నారు.

Samayam Telugu 5 May 2018, 6:27 pm
విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపించిన కొద్దిసేపటికే వైసీపీలో చేరిపోయారు. కృష్ణా జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలిసి... పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటూ కుమారుడు సుకుమార్ వర్మ, ముఖ్య అనుచరులు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిక తర్వాత టీడీపీ, చంద్రబాబుపై మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఎలమంచిలిలో టీడీపీ గెలుపుకు సహకరించానని... కాని పార్టీ మాత్రం చిన్న చూపు చూసిందని విమర్శించారు. చంద్రబాబు, నారా లోకేష్‌లు తనను నమ్మించి మోసం చేశారన్నారు.
Samayam Telugu Kannababu


కన్నబాబు విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులతో టీడీపీలో చేరారు. ఎన్నికలకు ముందే పార్టీలోకి రావడంతో ఎమ్మెల్యే టిక్కెట్ దక్కలేదు. తర్వాత ఎమ్మెల్సీ పదవిపై ఆశ పెట్టుకున్నా దక్కలేదు. దీంతో ఆయన వైసీపీలో చేరాలని భావించారు. విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి గంటా శ్రీనివాస్ బుజ్జగించేందుకు ప్రయత్నించినా... అవి ఫలించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.