రాజకీయంగా ప్రజలు తనను మరచిపోతున్న తరుణంలో సీఎం కేసీఆర్ పిలిచారని మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు అండగా ఉండాలని కేసీఆర్ తనను కోరారని చెప్పారు. బుధవారం (సెప్టెంబర్ 12) తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలన, కేసీఆర్పై ఆయన ప్రశంసలు కురిపించారు.
‘కేసీఆర్ గారు ఆప్యాయతతో, అభిమానంతో నన్ను పిలిచారు. నాపై నమ్మకం ఉంచారు. రాజకీయంగా నన్ను మరచిపోతున్న తరుణంలో పిలిచి గురుతర బాధ్యత అప్పగించారు. తెలంగాణకు నువ్ ఈవిధంగా ఉపయోగపడాలి అని చెప్పారు. ఆయన చెప్పినవిధంగా ముఖ్యమైన కార్యక్రమాలు పాల్పంచుకుంటా’ అని సురేశ్ రెడ్డి తెలిపారు.
‘సురేశ్ రెడ్డికి ఇంత ఉందా అనే సందేహం వస్తున్న తరుణంలో కేసీఆర్ నన్ను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని మన్నించి స్వీకరించాల్సిన బాధ్యత నాపై ఉంది. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాలన్నీ మీ ముందున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తోంది’ అని సురేశ్ రెడ్డి అన్నారు.
గోదావరి, కృష్ణా నదులకు చెందిన ప్రతి నీటి చుక్కా తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు అందించడానికి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని సురేశ్ రెడ్డి ప్రశంసించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి వేగంగా వెళ్తున్నాయని అన్నారు.
తన ఆలోచనలకు సరైన వేదిక దొరికిందని సురేశ్ రెడ్డి చెప్పారు. 30 ఏళ్లకు పైబడిన రాజకీయ జీవితంలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నానని, ఎన్నో పుస్తకాలు రాశానని, నివేదికలు రూపొందించానని తెలిపారు. ఆ అనుభవాలన్నింటినీ ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించే అవకాశం కలిగిందని ఆయన చెప్పుకొచ్చారు. 1998లో తెలంగాణలో నీటి వనరులు ఏవిధంగా ఉపయోగించాలి అనే అంశంపై చేసిన నివేదికను మంత్రి కేటీఆర్కు అందజేసిన సురేశ్ రెడ్డి.. కేసీఆర్కు చేరవేయాల్సిందిగా కోరారు.
ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటానని సురేశ్ రెడ్డి తెలిపారు. గల్ఫ్ బాధితులు, శ్రీరాంసాగర్ సమస్యలు తదితరాల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కేసీఆర్తో తనకు 1989 నుంచి అనుబంధం ఉందని చెప్పారు. వేర్వేరు వేదికల్లో, వేర్వేరు పార్టీల్లో ఉన్నా కేసీఆర్ ఆలోచనలు, ప్రసంగాలు తనలో స్ఫూర్తి నింపాయని ఆయన చెప్పారు. కొండగట్టు విషాదంలో ఉండటం వల్లే కేసీఆర్ ఈ కార్యక్రమానికి రాలేకపోయారని ఆయన తెలిపారు.
ఎంపీలు కేశవరావు, కవిత, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు సురేశ్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ బండారి లక్ష్మారెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.
‘కేసీఆర్ గారు ఆప్యాయతతో, అభిమానంతో నన్ను పిలిచారు. నాపై నమ్మకం ఉంచారు. రాజకీయంగా నన్ను మరచిపోతున్న తరుణంలో పిలిచి గురుతర బాధ్యత అప్పగించారు. తెలంగాణకు నువ్ ఈవిధంగా ఉపయోగపడాలి అని చెప్పారు. ఆయన చెప్పినవిధంగా ముఖ్యమైన కార్యక్రమాలు పాల్పంచుకుంటా’ అని సురేశ్ రెడ్డి తెలిపారు.
‘సురేశ్ రెడ్డికి ఇంత ఉందా అనే సందేహం వస్తున్న తరుణంలో కేసీఆర్ నన్ను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని మన్నించి స్వీకరించాల్సిన బాధ్యత నాపై ఉంది. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాలన్నీ మీ ముందున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తోంది’ అని సురేశ్ రెడ్డి అన్నారు.
గోదావరి, కృష్ణా నదులకు చెందిన ప్రతి నీటి చుక్కా తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు అందించడానికి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని సురేశ్ రెడ్డి ప్రశంసించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి వేగంగా వెళ్తున్నాయని అన్నారు.
తన ఆలోచనలకు సరైన వేదిక దొరికిందని సురేశ్ రెడ్డి చెప్పారు. 30 ఏళ్లకు పైబడిన రాజకీయ జీవితంలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నానని, ఎన్నో పుస్తకాలు రాశానని, నివేదికలు రూపొందించానని తెలిపారు. ఆ అనుభవాలన్నింటినీ ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించే అవకాశం కలిగిందని ఆయన చెప్పుకొచ్చారు. 1998లో తెలంగాణలో నీటి వనరులు ఏవిధంగా ఉపయోగించాలి అనే అంశంపై చేసిన నివేదికను మంత్రి కేటీఆర్కు అందజేసిన సురేశ్ రెడ్డి.. కేసీఆర్కు చేరవేయాల్సిందిగా కోరారు.
ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటానని సురేశ్ రెడ్డి తెలిపారు. గల్ఫ్ బాధితులు, శ్రీరాంసాగర్ సమస్యలు తదితరాల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కేసీఆర్తో తనకు 1989 నుంచి అనుబంధం ఉందని చెప్పారు. వేర్వేరు వేదికల్లో, వేర్వేరు పార్టీల్లో ఉన్నా కేసీఆర్ ఆలోచనలు, ప్రసంగాలు తనలో స్ఫూర్తి నింపాయని ఆయన చెప్పారు. కొండగట్టు విషాదంలో ఉండటం వల్లే కేసీఆర్ ఈ కార్యక్రమానికి రాలేకపోయారని ఆయన తెలిపారు.
ఎంపీలు కేశవరావు, కవిత, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు సురేశ్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ బండారి లక్ష్మారెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.