యాప్నగరం

జనసేనలో చేరిన టీటీడీ మాజీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి

జనసేనలోకి చేరికలు.. పవన్ సమక్షంలో పార్టీలో చేరిన టీటీడీ మాజీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి..

Samayam Telugu 18 Oct 2018, 1:13 pm
జనసేనలోకి చేరికలు ఊపందుకున్నాయి. గత వారమే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పార్టీలో చేరగా.. తాజాగా టీటీడీ మాజీ ఛైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి కూడా పవన్‌కు జైకొట్టారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న పవన్‌ను కలిసి.. పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చదలవాడకు పార్టీ కండువా కప్పి.. సాదరంగా ఆహ్వానించారు జనసేనాని. కృష్ణమూర్తితో పాటూ మరికొందరు నేతలు కూడా పార్టీలో చేరారు.
Samayam Telugu Chadalawada..


జనసేన విధానాలు, పవన్‌ సేవా దృక్పథాలు నచ్చి పార్టీలో చేరానన్నారు చదలవాడ. పార్టీలో చేరడం సంతోషంగా ఉందని.. తిరుపతి, చిత్తూరుజిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కృష్ణమూర్తి జనసేనలో చేరడం శుభపరిణామమన్నారు పవన్. సీనియర్ నేతలు పార్టీకి ఎంతో ముఖ్యమని.. మొదటి నుంచి తమ కుటుంబానికి ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.

చదలవాడ కృష్ణమూర్తి రాజకీయాల్లో సీనియర్ నేతగా ఎదిగారు. 1973లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. 1981లో నాయుడుపేట సర్పంచ్‌గా గెలిచారు. 1994లో తిరుపతి టిక్కెట్ ఆశిస్తే.. కాంగ్రెస్ శ్రీకాళహస్తి టిక్కెట్ వచ్చింది. కాని ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 1999లో కాంగ్రెస్ టిక్కెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరి.. ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ చైర్మన్‌గా నియమించారు. కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన.. చివరికి జనసేనలో చేరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.