యాప్నగరం

రమణ దీక్షితులకు మరో షాక్.. టీటీడీ ఆగమ సలహాదారుడిగా తొలగింపు

మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీ మళ్లీ షాకిచ్చింది. ఆయన్ను ఆగమ సలహాదారుడి పదవి నుంచి తొలగించింది. ఆయన రమణ దీక్షితులు స్థానంలో వేణుగోపాల దీక్షితుల్ని నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 26 Jun 2018, 8:09 pm
మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీ మళ్లీ షాకిచ్చింది. ఆయన్ను ఆగమ సలహాదారుడి పదవి నుంచి తొలగించింది. ఆయన రమణ దీక్షితులు స్థానంలో వేణుగోపాల దీక్షితుల్ని నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ అర్చకులు 65 ఏళ్లకు రిటైర్మెంట్‌ కావాలని టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికే ఆయన ప్రధాన అర్చకుడిగా రిటైర్‌కాగా .. టీటీడీ తాజా నిర్ణయంతో ఉన్న మరో పదవిని ఇప్పుడు కోల్పోవాల్సి వచ్చింది. దీక్షితుల వ్యవహార శైలి, టీటీడీపై చేస్తున్న విమర్శలతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu Ramana


రమణ దీక్షితులు కొద్ది రోజులుగా టీటీడీతో పాటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శ్రీవారి ఆభరణాలతో పాటూ ఆలయంలో పూజా కైంకర్యాలు సరిగా జరగడం లేదంటూ ఆరోపణలు చేశారు. ప్రధాన అర్చక పదవిని కోల్పోయిన తర్వాత మరింత దూకుడు పెంచిన ఆయన ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేశారు. ఆ వెంటనే ప్రతిపక్ష నేత జగన్‌ను కలవడంపై కూడా దుమారం రేగింది. మరి ఆగమ సలాహాదారుడిగా టీటీడీ తొలగించడపై దీక్షితులు ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తిగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.