యాప్నగరం

డ్రగ్స్ భూతం: హైదరాబాద్ నుంచి వరంగల్‌కు షిఫ్ట్!

హైదరాబాద్‌ను కుదిపేసిన డ్రగ్స్ భూతం వరంగల్‌లోనూ పాగా వేసింది. హన్మకొండలోని నిట్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిట్ కళాశాలలో బీటెక్..

TNN 30 Aug 2017, 7:30 pm
హైదరాబాద్‌ను కుదిపేసిన డ్రగ్స్ భూతం వరంగల్‌లోనూ పాగా వేసింది. హన్మకొండలోని నిట్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న రమేష్, బిజ్జు అనే విద్యార్థులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన ఖాజీపేట ఎక్సైజ్‌ పోలీసులు బుధవారం (ఆగస్టు 30) వారిద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు వారి వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
Samayam Telugu excise police arrest warangal nit students in drugs case
డ్రగ్స్ భూతం: హైదరాబాద్ నుంచి వరంగల్‌కు షిఫ్ట్!


డగ్ర్స్‌ కేసులో ఇటీవల హైదరాబాద్‌లో అరెస్టైన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ వ్యవహారం వరంగల్‌లోనూ కలకలం రేపడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఎక్సైజ్ అధికారులతో కలిసి విద్యా సంస్థలు, ఐటీ కంపెనీలు తీసుకున్న చొరవ ఫలితంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మంచి ఫలితాలు వస్తున్నాయని అకున్ సభర్వాల్ మంగళవారం మీడియాతో అన్నారు. ఈ విషయం చెప్పి 24 గంటలు గడవక ముందే రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో మళ్లీ డ్రగ్స్‌ కలకలం రేగడంతో.. అందరూ ఆలోచనలో పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.