యాప్నగరం

ఆయుష్మాన్ భారత్‌.. ప్రజలకు ఓ వరం: కోవింద్

దక్షిణాది శీతకాలం విడిది కోసం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి కోవింద్, శనివారం కరీంనగర్‌లో పర్యటించారు.

Samayam Telugu 22 Dec 2018, 3:23 pm
చారిత్రాత్మక నేపథ్యమున్న కరీంనగర్‌కు రావడం ఇదే తొలిసారని, ఇక్కడకు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. దక్షిణాది శీతకాలం విడిది కోసం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి కోవింద్, శనివారం కరీంనగర్‌లో పర్యటించారు. ప్రతిమ వైద్య కళాశాలలో వివిధ యూనిట్లు, ఆడిటోరియాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రపంచ వ్యాప్తంగా మన వైద్యులో ఎంతో గుర్తింపు ఉందని, వైద్య సేవల రంగంలో మనం ఇంకా ఎంతో అభివృద్ధి సాధించాల్సి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా సరైన వైద్యం అందడం లేదని, తలసేమియా బాధితుల విషయంలో మనం మొదటిస్థానంలో ఉన్నామన్నారు. ఈ అంశంపై జనాల్లో అవగాహన కల్పించడం ద్వారా నివారించవచ్చని, రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్రపతి కోవింద్‌ ఉద్ఘాటించారు.
Samayam Telugu kovind


వైద్య రంగంలో దేశం అభివృద్ధి సాధించినా చిన్నారుల్లో తలసేమియా వ్యాధి బాధిస్తోందని కోవింద్‌ ఆవేదన వ్యక్తంచేశారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు, వైద్యులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మెడికల్‌ టూరిజంలో మన దేశం ప్రత్యేక అభివృద్ధి సాధిస్తోందని సంతోషం వ్యక్తంచేశారు. పట్టణాల్లోని వైద్యసేవలు గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. కేంద్రం ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ప్రజలకు ఒక వరమని, దీనివల్ల లక్షలాది పేదలకు ఉచిత వైద్యం అందుతుందని రాష్ట్రపతి ఆకాంక్షించారు. దేశంలో పోలియో, స్మాల్ ఫాక్స్ లాంటి వ్యాధులను విజయవంతంగా నిర్మూలించామని, వైద్య విద్యలో బాలబాలికల నిష్పత్తి పెరగడం సంతోషకర పరిణామమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.