యాప్నగరం

వీడియో: నీరుగార్చిన నీట్.. పదో అంతస్తు నుంచి దూకిన యువతి

నీట్ పరీక్షలో అర్హత సాధించకపోవడంతో మనస్తాపానికి గురై అబిడ్స్‌లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకున్న యువతి కాచిగూడకు చెందిన జస్లీస్ కౌర్ (18)గా పోలీసులు గుర్తించారు.

Samayam Telugu 6 Jun 2018, 1:32 pm
అబిడ్స్‌లో ఓ బహుళ అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి వివరాలు తెలిశాయి. నీట్ పరీక్షలో అర్హత సాధించకపోవడంతో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. ఆత్మహత్య చేసుకున్న యువతి కాచిగూడకు చెందిన జస్లీస్ కౌర్ (18)గా పోలీసులు గుర్తించారు. భవనంపై నుంచి యువతి దూకుతుండగా.. కింద నుంచి చాలా మంది వద్దని వారిస్తూ అరిచారు. కానీ, ఆమె క్షణాల్లో కిందకి దూకేసి ప్రాణాలు తీసుకుంది. ఆ దృశ్యాలను కొంత మంది తమ సెల్‌ఫోన్లలో బంధించారు.
Samayam Telugu Jasleen


అబిడ్స్‌లోని మయూరి కాంప్లెక్స్ బిల్డింగ్ పదో అంతస్తు నుంచి యువతి కిందకు దూకిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం (జూన్ 5) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. యువతి కాచిగూడకు చెందిన జస్లీన్ కౌర్‌గా గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పక్కా ప్రణాళికతో వచ్చిన యువతి ఎత్తైన భవంతిని ఎంచుకొని నేరుగా పై అంతస్తుకు వెళ్లి దూకేసింది. లిఫ్టులో వెళ్తే ఎవరైనా ప్రశ్నిస్తారనే అనుమానంతో మెట్ల ద్వారానే పైకి చేరుకుంది. ఆమె మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.

పదో అంతస్తు నుంచి కిందపడటంతో జస్లీన్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫరీక్షలో అర్హత సాధించకపోవడంతో నిరాశ చెందిన జస్లీన్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోనూ ఇలాగే మనస్తాపానికి గురైన ప్రతిభ అనే మరో యువతి ఎలుకల మందు తీసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.