యాప్నగరం

ఎన్టీఆర్ వర్ధంతి: కుటుంబ సభ్యుల నివాళి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాతనట సార్వభౌముడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.

TNN 18 Jan 2018, 11:02 am
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నందమూరి వారసులు హరికృష్ణ, బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ మనవళ్లు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌‌లు కూడా దివంగత నేతకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. తెలుగు భాష ఉన్నంత వరకూ ఎన్టీఆర్ మన మధ్య జీవించి ఉంటారన్నారు. తెలుగువారి గుండె చప్పుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ కొనియాడారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కూడా మహానేతకు నివాళులు అర్పించారు.
Samayam Telugu family members pays condolences to n t rama rao at ntr ghat
ఎన్టీఆర్ వర్ధంతి: కుటుంబ సభ్యుల నివాళి


ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదని, ఓ వ్యవస్థ అని తెలిపారు. మహానటుడి వర్ధంతి సందర్భంగా ఆయన మనువడు, ఏపీ మంత్రి లోకేష్ బాబు నివాళులు అర్పించారు. ‘ఎవరి కారణంగా అయితే కోట్లాది జీవితాలలో వెలుగు నిండి, చరిత్ర పునీతమవుతుందో అలాంటి మహనీయుడిని కారణజన్ముడు అంటారు. తెలుగుజాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానాయకుని స్మృతికి నివాళులర్పిద్దాం. ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునరంకితమవుదాం’ అని లోకేష్ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.