యాప్నగరం

డిచ్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎండ తీవ్రతే కారణం

నిజామాబాద్‌లోని డిచ్‌పల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. కారు, లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మండుతున్న ఎండలే ప్రమాదానికి కారణమయ్యాయి.

Samayam Telugu 30 Apr 2018, 8:50 pm
నిజామాబాద్‌లోని డిచ్‌పల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. కారు, లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం (ఏప్రిల్ 30) ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరికి చెందిన రైస్‌మిల్‌ వ్యాపారి రాఘవేంద్ర తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. సోమవారం స్వస్థలానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Samayam Telugu dichpally


ఎండ తీవ్రత వల్ల కారు టైరు వేడెక్కి ఒక్కసారిగా పేలిపోవడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. కారు పూర్తిగా నుజ్జు నుజ్జై మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.