యాప్నగరం

చిన్నారులతో సహా కుటుంబం ఆత్మహత్య

కారణాలేంటో తెలియవు కానీ... ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది.

TNN 25 May 2017, 12:03 pm
కారణాలేంటో తెలియవు కానీ... ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని బీడీ కాలనీలో నివాసం ఉంటోంది సంతోషిరూప. ఆమె తన ఇద్దరు కొడుకు సిద్ధార్థ (9), సాయిరామ్ (5)తో పాటూ పద్మావతి (60)తో కలిసి నివసిస్తోంది. పద్మావతి... సంతోషి రూపకు తల్లి కానీ అత్త కానీ అవుతుందని సమాచారం. అయితే వీరంతా నాలుగు రోజులే క్రితమే ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ఇంట్లో నుంచి తీవ్రంగా దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు చెప్పారు. ఆ ఇంట్లో వాళ్లు నాలుగు రోజులుగా బయటికి రాకపోవడం, వాసన వస్తుండడంతో వారికి అనుమానం వచ్చింది.
Samayam Telugu family of four commits suicide in eluru
చిన్నారులతో సహా కుటుంబం ఆత్మహత్య


పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా... నలుగురి మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలు పడి ఉన్న తీరును బట్టి ఆత్మహత్యగానే తేల్చారు పోలీసులు. అయితే వారు ఇంతటి నిర్ణయం తీసుకోవడానికి వెనుక కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంత కాలం క్రితమే కుటుంబసభ్యులను కోల్పోవడం, ఆర్థిక సమస్యలు, మానసిక కుంగుబాటు ఇవే వారికి ఆత్మహత్యకు కారణాలు అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.