యాప్నగరం

సంకెళ్లతో కోర్టుకు హాజరైన మిర్చి రైతులు

ఖమ్మం మిర్చి మార్కెట్‌ యార్డుపై దాడి ఘటనలో అరెస్టయిన 10 మంది రైతులకు ఖమ్మం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Samayam Telugu 11 May 2017, 4:06 pm
ఖమ్మం మిర్చి మార్కెట్‌ యార్డుపై దాడి ఘటనలో అరెస్టయిన 10 మంది రైతులకు ఖమ్మం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రైతులకు మద్దతుగా భారీగా ప్రజలు కోర్టు వద్దకు తరలివచ్చారు. ఈ కేసులో ఇన్నిరోజులు రిమాండ్ లో ఉన్న రైతులను గురువారం ఉదయం నేరుగా జిల్లా నుంచి జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చారు.
Samayam Telugu farmers fettered with chains in khammam district
సంకెళ్లతో కోర్టుకు హాజరైన మిర్చి రైతులు


ఈ రైతులకు చేతికి సంకెళ్లు వేసి తీసుకొచ్చారు. దీంతో రైతులకు సంకెళ్లు ఉండటాన్ని పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు, న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. ఈరోజు కోర్టులో రైతుల బెయిల్‌పై విచారణ ఉండటంతో కోర్టు వద్ద భారీగా ప్రజలు గుమిగూడారు.

రైతులను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు. వారి చేతులకు సంకెళ్లు వేసి ఉండటాన్ని ఖండించారు. నిరంకుశ ప్రభుత్వానికి ఇదే నిదర్శమని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.