యాప్నగరం

వైఎస్సార్సీపీ ఎంపీల నిరాహార దీక్ష భగ్నం

ఏపీకి ప్రత్యేకహోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు.

Samayam Telugu 11 Apr 2018, 12:42 pm
ఏపీకి ప్రత్యేకహోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఆరో రోజున నిరాహార దీక్షను కొనసాగిస్తున్న ఎంపీలు మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలను పోలీసులు రామ్ మనోహన్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఏపీ భవన్ వేదికగా జరుగుతున్న వైసీపీ ఎంపీల నిరాహార దీక్షా శిబిరాన్ని బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసులు చుట్టుముట్టే సరికి అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Samayam Telugu avinashreddymithun


ఎంపీల ఆరోగ్యం క్షీణిస్తున్న నేఫథ్యంలో వారు దీక్ష ఆపాలని లోహియా ఆసుపత్రి వైద్యులు ప్రకటించిన కొంత సేపటికే అక్కడకు పోలీసులు వచ్చేశారు. ఎంపీలను బలవంతంగా ఎత్తుకుని అంబులెన్స్ లలో వేశారు. ఈ సమయంలో దీక్షా శిబిరం వద్ద తోపులాట చోటు చేసుకుంది. అప్పటికే అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

అయితే పోలీసులు బలవంతంగా ఎంపీలను అంబులెన్స్ లలోకి ఎక్కించారు. అనంతరం వైసీపీ కార్యకర్తలు అంబులెన్స్ లను అడ్డుకునే ప్రయత్నించారు. వాటి ముందు బైఠాయించి హోదా నినాదాలను చేశారు. ఈ విధంగా ఏపీకి ప్రత్యేకహోదా నినాదాలతో ఏపీ భవవన్ మార్మోగింది. అయితే వారందరినీ పోలీసులు పక్కకు ఈడ్చేసి అంబులెన్స్‌లను అక్కడ నుంచి కదిలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.