యాప్నగరం

కొడుకి మృతి తట్టుకోలేక తండ్రి కూడా...

కొడుకు మరణాన్ని తట్టుకోలేని ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

TNN 14 Dec 2016, 2:04 pm
కొడుకు మరణాన్ని తట్టుకోలేని ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి, కొడుకులిద్దరరూ ఒకే రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను తీవ్రంగా కలచి వేసింది. ఏపీలోని ప్రకాశం జిల్లాలోని దొనకొండ మండలం ఇండ్ల చెరువులో నివసిస్తున్నాడు సాదం పెదరామయ్య (52). అతనికి పదిహేనేళ్ల కొడుకు వీర వెంకట్రామయ్య ఉన్నాడు. కొడుకు బుధవారం తెల్లవారుజామును అయిదున్నర సమయంలో ఊరికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
Samayam Telugu father and son commits suicide at same place in ap
కొడుకి మృతి తట్టుకోలేక తండ్రి కూడా...


గమనించిన గ్రామస్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కొడుకు మరణాన్ని తట్టుకోలేని తండ్రి పెదరామయ్య అదే ట్రాక్ పై గుంటూరు- కాచిగూడ ట్రైన్ వస్తుండగా ఆ ట్రైన్ కిందపడి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తండ్రీ కొడుకులు ఒకే రోజు, ఒకే చోట మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.