యాప్నగరం

పెద్దపల్లి జిల్లా: క్షణికావేశంలో కొడుకును కొట్టి చంపిన తండ్రి

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కొడుకు పాలిట కాలయముడయ్యాడు. చిన్న గొడవలకే దారుణంగా కొట్టి చంపేశాడు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలంరేపింది.

Samayam Telugu 2 Jul 2018, 9:20 am
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కొడుకు పాలిట కాలయముడయ్యాడు. చిన్న గొడవలకే దారుణంగా కొట్టి చంపేశాడు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలంరేపింది. ఓదెల మండలం ఉప్పరపల్లెకు చెందిన ఆదిరెడ్డికి ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు విజయ్‌కుమార్ డిగ్రీ పూర్తి చేసి తండ్రితో పాటూ వ్యవసాయం చేస్తున్నాడు. ఆదిరెడ్డికి మద్యం అలవాటు ఉండటంతో.. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. తండ్రి తీరుపై కుమారుడు విజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. మద్యం మానేయమని ఎన్నోసార్లు నచ్చజెప్పాడు.
Samayam Telugu Murder..


ఎన్నిసార్లు చెప్పినా ఆదిరెడ్డి పద్దతి మార్చుకోలేదు. కొద్ది రోజుల క్రితం ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. కోపంతో విజయ్‌కుమార్ తండ్రిపై చేయి చేసుకున్నాడు. దీన్ని మనసులో పెట్టుకొని కొడుకుపై కక్ష పెంచుకున్నాడు. అతడ్ని ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. విజయ్ ఇంటి ముందు నిద్రిస్తుండగా.. మిగిలిన కుటుంబ సభ్యులు లోపల పడుకున్నారు. అర్థరాత్రి ఆదిరెడ్డి మంచం దగ్గరకు వెళ్లి పార తీసుకొని తలపై మోదాడు. అతడు చనిపోయాడని నిర్థారించుకొన్న తర్వాత దుప్పటి కప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.

వేకువజామున ఆదిరెడ్డి మంచం దగ్గరకెళ్లి చూడగా.. అతడు రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విజయ్ తల్లి ఫిర్యాదుతో ఆదిరెడ్డిపై కేసు నమోదు చేయగా.. నిందితుడు స్థానిక సీఐ ముందు లొంగిపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.