యాప్నగరం

కొడుకు వేధింపులు.. నరికి చంపిన తండ్రి!

చిన్నవయసులోనే మద్యానికి బానిసైన రవి మద్యానికి బానిసై తల్లిదండ్రులను, భార్యాబిడ్డలనూ నిత్యం కొడుతూ వేధిస్తున్నాడు. రవి ఉంటున్న ఇంటికి చేరిన అతడి తండ్రి రాజం ఆరుబయట నిద్రిస్తున్న అతడిని గొడ్డలితో కిరాతకంగా నరికాడు.

Samayam Telugu 3 Jun 2018, 3:16 pm
తాగుడుకు అలవాటు పడి తమకు నిత్యం నరకం చూపిస్తున్న ఓ వ్యక్తిని కన్నతండ్రే హతమార్చిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని పొరండ్లకు చెందిన బోదనపు రాజం, లక్ష్మీ దంపతుల కుమారుడు రవి (40). అతడికి భార్య గంగు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నవయసులోనే రవి మద్యానికి బానిసై తల్లిదండ్రులను, భార్యాబిడ్డలనూ నిత్యం కొడుతూ వేధిస్తున్నాడు. భరించలేని తల్లిదండ్రులు అతడికి దూరంగా జగిత్యాలలోని ఓ అపార్టుమెంటులో పనికి కుదిరి అక్కడే ఉంటున్నారు. భార్యాపిల్లలు పుట్టింటికి వెళ్లారు. రవి ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు.
Samayam Telugu murder


కొద్ది రోజుల క్రితం మద్యం మత్తులో గోడ దూకడంతో రవికి రెండు కాళ్లూ విరిగిపోయాయి. వైద్యం చేయించుకుని మంచానికే పరిమితయ్యాడు. నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం (జూన్ 1) ఉదయం 7 గంటల సమయంలో రవి ఉంటున్న ఇంటికి చేరిన అతడి తండ్రి రాజం ఆరుబయట నిద్రిస్తున్న అతడిని గొడ్డలితో కిరాతకంగా నరికాడు. మొత్తం 12 గొడ్డలి గాట్లు పడి రవి రక్తం మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజం, అతని భార్య లక్ష్మీ కలిసే హత్య చేసినట్లు ఒప్పుకొని లొంగిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.