విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు ఎదుట పండుగ వాతావరణం నెలకొని ఉంది. రియో రాక్ స్టార్ పీవీ సింధు కోచ్ తో కలిసి ప్రత్యేక విమానంలో విజయవాడ వస్తోంది. కాసేపట్లోనే ఆమె ఎయిర్ పోర్టులో అడుగుపెట్టబోతోంది. ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం తెలిపేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. స్కూలు విద్యార్థులు, అభిమానులు, అధికారులు భారీగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విద్యార్థులు జాతీయ జెండాలు చేతబట్టి సింధుకు స్వాగతం పలకనున్నారు. పలు కళారూపాలు, సాంప్రదాయ నృత్యకారులు, డప్పు వాయిద్యాకారులు తమ ప్రదర్శనలతో ఆమెకు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే అక్కడ ప్రదర్శనలు సాగుతున్నాయి. ప్రభుత్వం తరుపున మంత్రులు, అధికార ప్రతినిధులు సింధు కోసం వేచి చూస్తున్నారు.
గన్నవరం ఎయిర్పోర్టు దగ్గర సందడే సందడి
విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు ఎదుట పండుగ వాతావరణం నెలకొని ఉంది.
TNN 23 Aug 2016, 10:15 am