యాప్నగరం

భూమా అంత్యక్రియలు పూర్తి

తీవ్ర గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందిన తెదేపా సీనియర్‌ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

TNN 13 Mar 2017, 5:51 pm
తీవ్ర గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందిన తెదేపా సీనియర్‌ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆళ్లగడ్డలోని శోభా ఘాట్‌ వద్ద అధికార లాంఛనాలతో ఆయ‌న భౌతికకాయానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. 2014 ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగివస్తూ.. కారు ప్రమాదంలో మరణించిన భూమా సతీమణి శోభా నాగిరెడ్డికి అంత్యక్రియలు చేసిన ప్రదేశాన్ని శోభా ఘాట్‌తో పిలుస్తున్నారు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి పార్థివదేహానికి శోభా ఘాట్ పక్కనే తుది వీడ్కోలు పలికారు. ఆయన కుమారుడు.. జగత్ విఖ్యాత్ రెడ్డి భూమా భౌతిక కాయం ఉంచిన చితికి నిప్పంటించి అంత్యక్రియలను పూర్తి చేశారు.
Samayam Telugu final rights for bhooma nagireddy
భూమా అంత్యక్రియలు పూర్తి



ఈ కార్యక్రమానికి ప్రముఖులతో పాటు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యంగా ఆయన అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చి నివాళులు అర్పించారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన భూమా నాగిరెడ్డి ఇకలేరని వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు.
అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సభాపతి కోడెల శివప్రసాద్‌రావు, మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, పరిటాల సునీత, పీతల సుజాత, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ తదితరులు భూమా భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆ తర్వాత భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల అశ్రునయనాల మధ్య ఆయన నివాసం నుంచి శోభా ఘాట్ వరకూ అంతిమయాత్ర కొనసాగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.