యాప్నగరం

నేడు తెలంగాణ ఓటర్ల జాబితా.. హైకోర్టుకు సమర్పించిన తర్వాత అందుబాటులోకి

ఓటర్ల జాబితాను శుక్రవారం హైకోర్టుకు సమర్పించిన అనంతరం అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

Samayam Telugu 12 Oct 2018, 8:17 am
డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను శుక్రవారం (అక్టోబరు 12) ఎన్నికల సంఘం ప్రకటించనుంది. వాస్తవానికి అక్టోబర్ 8న జాబితా ప్రకటించాల్సి ఉన్నప్పటికి హైకోర్టులో కేసు కారణంగా జాప్యమైంది. తెలంగాణ ఓటర్ల జాబితా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం శుక్రవారం జాబితాను విడుదల చేయనుంది.
Samayam Telugu Telugu-image (2)


ఓటర్ల జాబితాను శుక్రవారం హైకోర్టుకు సమర్పించిన అనంతరం అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా నాటికి రాష్ట్రంలో 2.61 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో 2.81 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. తాజా జాబితాలో అంతకంటే ఎక్కువగానే ఉండనున్నారు.
ఇది కూడా చదవండి: ఈ నెల 12న తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల చేసుకోవచ్చు: హైకోర్టు

శుక్రవారం ఓటర్ల తుది జాబితాను ప్రకటించి.. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీకి పది రోజుల ముందు వరకు కూడా ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిరునామా, ఇతర మార్పుల కోసం వచ్చే దరఖాస్తులను కూడా నామినేషన్ల చివరి గడువు వరకు తీసుకోనున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ ఎన్నికల షెడ్యూలు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.