యాప్నగరం

కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం: ఈటల

అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

TNN 13 Mar 2017, 3:43 pm
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ రూపకల్పనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించామని తెలిపారు. పింఛన్లు, బియ్యం ఇవ్వడమే ప్రభుత్వ పని కాదు. ప్రజల్లో నైపుణ్యాన్ని గుర్తించి వారు ఎదిగేలా చర్యలు తీసుకోవడం మా ప్రధాన విధి అని ఆయన అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశామని ఆయన తెలిపారు.
Samayam Telugu finance minister etela rajender presents telangana states fourth budget
కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం: ఈటల


వృత్తిదారుల అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సూచిక అని ఈటల పేర్కొన్నారు. కుల వృత్తులకు కేటాయింపులతో అన్ని వర్గాలవారికి లాభం చేకూరుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కులవృత్తుల వారికి ఆధునిక సాంకేతికత అందించి తోడ్పాటు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మేకలు, గొర్రెలు, పశువులు, కోళ్లు, చేపల పెంపకందారులకు సాయం చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 30,000 కోట్లకు పైగా కేటాయింపులు చేశామని ఈటల తెలిపారు. కనీస జీతభత్యాలు లేనివారికి మానవీయ కోణంలో వేతనాలు పెంచామని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి అంచనాల కంటే మెరుగ్గా ఉందని ఆయన స్పష్టం చేశారు. అందువల్లే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం లాంటి పరిణామాల్లోనూ రెండంకెల వృద్ధిరేటు సాధించామని ఆయన వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.