యాప్నగరం

కువైట్- హైదరాబాద్ విమానంలో మంటలు: తృటిలో తప్పిన ముప్పు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం తెల్లవారుజామున కువైట్- హైదరాబాద్ విమానానికి పెను ప్రమాదం తప్పింది.

Samayam Telugu 2 Aug 2018, 11:36 am
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం తెల్లవారుజామున కువైట్- హైదరాబాద్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. కువైట్ నుంచి 149 మంది ప్రయాణికులతో వస్తున్న విమానం రన్‌ వేపై దిగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గురువారం అర్థరాత్రి 1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న జజీరా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుడివైపున ఉన్న ఇంజిన్‌లో మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇంతలో పైలట్ దాన్ని చాకచక్యంగా నిలిపివేశాడు. లోపల ఉన్న ప్రయాణికులను సహాయక సిబ్బంది సురక్షితంగా దింపేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఓ వైపు మంటలను అదుపు చేస్తుండగానే, మరో పక్కన ప్రయాణికులు విమానం దిగేశారు. రన్‌ వేపై ఉన్న విమానం వద్దకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Samayam Telugu శంషాబాద్ విమానాశ్రయం


ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీని గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే మంటలు చెలరేగినట్టు పైలట్ తెలియజేశాడు. ఈ ఘటనకు ముందు రోజు ఉత్తర మెక్సికో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతోన్న ఏరోమెక్సికో విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 85 మంది గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాద సమయానికి విమానంలో 97 మంది ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బంది ఉన్నారు.

Read This Story also Mumbai Mirror

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.