యాప్నగరం

ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తి.. ఇక సెకండ్: కేటీఆర్

మా ప్రభుత్వం తొలి ఇన్నింగ్స్ ఆహ్లాదకరంగా పూర్తయింది. తెలంగాణ ప్రజల దీవెనలతో ఫలప్రదమైన రెండో ఇన్నింగ్స్‌ వైపు వెళ్తున్నాం.

Samayam Telugu 6 Sep 2018, 5:32 pm
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయిందని ఐటీ మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. తెలంగాణ శాసనసభను ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దుచేసిన సంగతి తెలిసిందే. శాసనసభను రద్దు చేస్తూ కేసీఆర్ మంత్రి వర్గం గురువారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మాన ప్రతిని గవర్నర్ నరసింహన్ వద్దకు కేసీఆర్ తీసుకెళ్లారు. ఆయన కూడా వెంటనే ఈ తీర్మానాన్ని ఆమోదించారు. కేసీఆర్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు. దీనికి కేసీఆర్ కూడా సమ్మతి తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నేతలు మాత్రమే పాల్గొన్నారు.
Samayam Telugu KTR


కాగా, శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ప్రభుత్వం తొలి ఇన్నింగ్స్ ఆహ్లాదకరంగా పూర్తయింది. తెలంగాణ ప్రజల దీవెనలతో ఫలప్రదమైన రెండో ఇన్నింగ్స్‌ వైపు వెళ్తున్నాం. మీకు మద్దతు, ప్రేమను మేం కోరుకుంటున్నాం’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
అయితే కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ రిప్లై ఇస్తుంటే.. మరికొందరు మళ్లీ టీఆర్ఎస్‌దే అధికారం అంటూ స్పందిస్తున్నారు. ‘ఇది 2014 కాదు, ప్రజలు మీరు చెప్పినవి అన్నీ నమ్మటానికి. ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు ఓటు వేస్తే.. చేయలేను, నా వల్లకాదు అని చేతులు ఎత్తేసి, మళ్లీ ప్రజల్ని ఓటు అడుగుతున్నారా? 9 నెలల్లో ప్రభుత్వం ఎన్నో చేయొచ్చు ప్రజలకి. తెలంగాణ ఆశయాలు ఏమీ సిద్ధించలేదు’ అని ఒక ట్విట్టరెట్ ఘాటుగానే స్పందించారు. ఇంకా ఇలాంటి రిప్లైలు చాలానే ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.