యాప్నగరం

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదురుగు మృతి

ఉపాధి కోసం కువైట్ వెళ్లిన వ్యక్తి స్వదేశానికి వస్తుండటంతో అతడికి స్వాగతం పలికేందుకు వెళ్లి, సంతోషంగా తిరిగొస్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబలించింది.

Samayam Telugu 2 Dec 2018, 7:38 am
చిత్తూరు జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రేణిగుంట-కడప రహదారిపై మామండూరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. కారు- లారీ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. వీరిలో ఏడాది చిన్నారి కూడా ఉండడం బాధాకరం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కడప జిల్లా సీకే దిమ్మెకు చెందిన గంగాధరం ఉపాధి కోసం కువైట్‌‌కు వెళ్లి అక్కడ నుంచి శనివారం సాయంత్రం చెన్నై చేరుకున్నాడు. అతడికి స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులు చెన్నైకు వెళ్లారు. అక్కడ నుంచి వారంతా కారులో కడపకు బయలుదేరారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కడప వైపు నుంచి రేణిగుంట వైపు వస్తున్న ఓ లారీ వీరి కారును ఢీకొట్టింది.
Samayam Telugu accident


ఈ ప్రమాదంలో గంగాధరం(35), ఆయన భార్య విజయమ్మ(30), తమ్ముడు ప్రసన్న(32), మరదలు మరియమ్మ(25) ఏడాది వయస్సున్న ప్రసన్న, మరియమ్మ కుమారుడు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని లోపల చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. అర్ధరాత్రి కావడంతో ప్రమాద సమాచారం ఆలస్యంగా తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. వేగంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.