యాప్నగరం

కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్ధులు గల్లంతు

గుంటూరు: కృష్ణా పుష్కరాల్లో విషాద ఘటన చోటు చేసుకుంది.

TNN 16 Aug 2016, 2:41 pm
గుంటూరు: కృష్ణా పుష్కరాల్లో అపశృతి చోటు చేసుకుంది. అమరావతి మండలం గిడుగు వద్ద స్నానం చేసేందుకు నదిలో దిగిన ఐగుదురు విద్యార్ధులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో గోపిరెడ్డి, లోకేష్ మృత దేహాలు లభ్యం కాగా మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన విద్యార్ధులు నందిగామ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న నగేష్ , హరీష్, హరిగోపీలుగా గుర్తించారు.
Samayam Telugu five students displaced in krishna river at amaravatignt dist
కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్ధులు గల్లంతు


పోలీసుల కథనం ప్రకారం కృష్ణా పుష్కరాల సందర్భంగా మంగళవారం ఉదయం 11 మంది విద్యార్ధులు గిడుగు పుష్కర ఘాట్ వద్ద నదిలో స్నానం చేసేందుకు దిగారు. నదీ ప్రాంతం లోతుగా ఉన్న విషయాన్ని వారు గుర్తించలేదు. ఒక్కసారిగా వచ్చిన నదీ ప్రవాహంలో ఐదుగురు విద్యార్ధులు కొట్టుకుపోయారు. కాగా పుష్కర ఏర్పాట్లు నిర్వహిస్తున్న అధికారుల వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.