యాప్నగరం

కొత్తగూడెం: అటవీ అధికారులపై మరో ఆటవిక దాడి

అటవీ అధికారి అనితపై దాడి ఘటన ఆగ్రహ జ్వాలలు ఆరకముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. కొత్తగూడెంలో అటవీ సిబ్బందిపై పోడు సాగుదారులు కర్రలతో దాడి చేశారు.

Samayam Telugu 2 Jul 2019, 7:23 pm
కాగజ్‌నగర్‌లో అటవీ అధికారి అనితపై దాడి ఘటనకు సంబంధించిన ఆగ్రహజ్వాలలు ఆరకముందే అటవీ సిబ్బందిపై మరో దాడి జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ అధికారులపై పోడు సాగుదారులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం (జులై 2) ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో మరోసారి ప్రకంపనలు రేపుతోంది.
Samayam Telugu forest
కొత్తగూడెం


కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలోని గుండాలపాడు సమీపంలో కొంత మంది పోడు రైతులు సోమవారం అర్ధరాత్రి తర్వాత ట్రాక్టర్లతో అటవీ శాఖకు చెందిన భూమిని దున్నుతున్నారనే సమాచారం అందడంతో అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ పనులు చేస్తున్న ట్రాక్టర్లను ఆపి ప్రశ్నించగా.. వారంతా అధికారులపై కర్రలతో దాడి చేశారు. ఫారెస్ట్ అధికారుల రాకకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు వారిపై దాడికి దిగారు. అటవీ సిబ్బంది వద్ద ఉన్న సెల్‌ఫోన్లను లాక్కున్నారు.

ఈ ఘటనలో సెక్షన్‌ ఆఫీసర్‌ నీలమయ్య, బీట్‌ ఆఫీసర్‌ భాస్కరరావు గాయపడ్డారు. కర్రలతో దాడి చేయడంతో ఈ ఇరువురి అధికారుల వీపుపై గాయాలయ్యాయి. పోడు సాగుదారుల నుంచి తప్పించుకున్న అటవీ అధికారులు నేరుగా ముల్కలపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశారు.

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుమన్‌ తెలిపారు. గాయపడిన అధికారులను ములకలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.