యాప్నగరం

తెలంగాణ టీడీపీ సీనియర నేత ఆకస్మిక మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మొహమ్మద్ మహబూబ్ శుక్రవారం ఆకస్మికంగా కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు.

Samayam Telugu 22 Jun 2019, 1:24 pm
తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మొహమ్మద్ మహబూబ్ శుక్రవారం ఆకస్మికంగా కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఈయన మృతి పట్ల టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహమూద్ అంకితభావంతో, నిస్వార్థంగా పార్టీకి సేవలు అందించారని ఆయన కొనియాడారు. ట్విట్టర్‌లో సంద్పించిన చంద్రబాబు ‘తెలంగాణ టీడీపీ నేత మహమూద్ ఆకస్మిక మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. ఆయన పార్టీ కోసం అంకితభావంతో, నిస్వార్థంగా పనిచేశారు. మైనారిటీల అభ్యున్నతి కోసం కృషి చేశారు. ప్రజాసేవకుడు ఎలా ఉండాలన్న దానిపై భావి తరాలకు ఆదర్శంగా నిలిచారు. ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుతున్నా. మహమూద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
Samayam Telugu mahmmad


ఉమ్మడి రాష్ట్రంలో నాటి టీడీపీ హాయాంలో హుడా డైరెక్టర్‌గా మొహ్మద్ మహబూబ్ బాధ్యతలు నిర్వహించారు. టీడీపీ మైనార్టీ విభాగంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నేతగా గుర్తింపు తెచ్చుకున్న మహబూబ్, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేవారు. ఎంతో మందికి పేదలకు సాయంచేశారని టీడీపీ నేతలు కొనియాడారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, టీడీపీ బీసీ సెల్ సెక్రెటరీ బాలాజీ గోస్వామి, టీఆర్ఎస్ నేత బీఎన్ రెడ్డి తదితరులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.