కేంద్ర మాజీమంత్రి జైపాల్రెడ్డి మృతి ఆయన కుటుంబంతో రాజకీయ వర్గాల్లో విషాదం నింపింది. సీనియర్ నేత, ఉత్తమ పార్లమెంటేరియన్, సౌమ్యుడిగా పేరున్న జైపాల్రెడ్డి ఇకలేరన్న వార్త తెలిసి అందరూ షాకయ్యారు. ఉదయం లేవగానే ఇంతటి విషాదవార్తను వినాల్సి వస్తుందనుకోలేదంటూ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది నేతలు జైపాల్ నివాసానికి వచ్చి భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.
జైపాల్రెడ్డికి బంధువైన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వీవీ ఘాట్ వద్ద అంత్యక్రియలకు స్థలాన్ని పరిశీలించేందుకు నేతలతో కలిసి వెళ్లారు.