యాప్నగరం

AP Secretariat: నేడు ఏపీ శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ పనులకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ శాశ్వత సచివాలయం నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం. ప్రపంచంలోనే ఎత్తైన 5 టవర్ల నిర్మాణం. అసెంబ్లీ ప్రాంగణంలో ఐదు టవర్ నిర్మాణం. ప్రత్యేకతలు ఇవే!

Samayam Telugu 27 Dec 2018, 10:27 am
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయం నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. డిసెంబరు 27న (గురువారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవన నిర్మాణానికి సంబంధించిన పునాది పనులను ప్రారంభించనున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే ఎత్తైన సచివాలయంగా రికార్డులకు ఎక్కనుంది.
Samayam Telugu Untitled33


అత్యంత ఎత్తైన ఐదు టవర్లతో డయాగ్రిడ్ విధానంలో సచివాలయాన్ని నిర్మిస్తారు. 250 మీటర్ల ఎత్తు గల అసెంబ్లీ భవనం ప్రాంగణంలో 69.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ టవర్లను నిర్మిస్తారు. ఒక్కో టవర్ ఎత్తు 212 మీటర్లు. ఇందుకు రూ.4890 కోట్ల వ్యయం కానుంది. సీఎం చంద్రబాబు గురువారం ఉదయం 8:50 గంటలకు ర్యాఫ్ట్ ఫౌండేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

ఈ పనులను సీఆర్డీఏ పర్యవేక్షించనుంది. మూడు రోజుల్లో 11.50 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటును వేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 20 రోజుల వ్యవధిలో శాశ్వత సచివాలయంలోని ఐదు బ్లాకులకూ ర్యాఫ్ట్ ఫౌండేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. దేశంలోనే అత్యంత భారీ ర్యాఫ్ట్ ఫౌండేషన్‌గా ఈ కార్యక్రమం జరగనుంది. 13 అడుగుల లోతులో ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేస్తారు. ప్రపంచ ప్రఖ్యాత చెందిన నార్మన్ ఫోస్టర్‌కి చెందిన ఫోస్టర్ అండ్ పార్టనర్ సంస్థ సచివాలయం టవర్ల నిర్మాణ ప్రణాళికను సీఆర్డీఏకు అందించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.