యాప్నగరం

పవిత్ర సంగమం వద్ద విషాదం.. న‌లుగురు విద్యార్థులు గ‌ల్లంతు

కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు గల్లంతయ్యారు. కృష్ణాజిల్లాలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద శ‌నివారం (జూన్ 23) చోటుచేసుకుంది.

Samayam Telugu 23 Jun 2018, 4:38 pm
కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద శ‌నివారం (జూన్ 23) ఈతకు వెళ్లిన నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు గల్లంతయ్యారు. వీరంతా కంచికచర్లలో మిక్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. నలుగురిలో ఒకరు స్నానం చేయడానికి నీటిలో దిగగా అదుపు తప్పి లోపలికి ప‌డిపోయాడు. ఈనేప‌థ్యంలో అతడిని కాపాడే ప్రయత్నం చేసిన ముగ్గురు విద్యార్ధులు కూడా నదిలో పడి గల్లంతయ్యారు.
Samayam Telugu pavitra sangamam


గ‌ల్లంతైన విద్యార్థులను ప్రవీణ్ (18), చైతన్య (18), శ్రీనాథ్ (19), రాజ్ కుమార్ (19)గా గుర్తించారు. వీరికోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.