శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కొత్తరౌతుపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్తో నలుగురు చనిపోయారు. అరటి తోటలో గెలలు కోస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు రాములు (50), వెంకన్న (50), పుణ్యవతి (45), బంగారమ్మ (40)గా గుర్తించారు. వీరిలో రాములు, పుణ్యవతి భార్యాభర్తలు. సోమవారం వెంకన్న ఇంట్లో పెళ్లి సందర్భంగా పసుపుకొట్టే కార్యక్రమం ఉండటంతో.. అరటి గెల తీసుకొద్దామని తోటకు వెళ్లారు. అయితే అరటి గెలపై విద్యుత్ తీగలు తెగిపడి ఉండటాన్ని గమనించలేదు. గెలను కొస్తుండగా.. రాములు, వెంకన్నకు షాక్ తగిలింది. వారిని కాపాడబోయి.. పుణ్యవతి, బంగారమ్మలు చనిపోయారు. నలుగురి మృతితో స్థానికంగా విషాదచాయలు అలముకోగా.. పెళ్లబాజాలు మోగాల్సిన ఇంట్లో చావుడప్పు మోగింది.
శ్రీకాకుళం: పెళ్లింట విషాదం.. కరెంట్ షాక్తో నలుగురి మృతి
పెళ్లి సందర్భంగా పసుపుకొట్టే కార్యక్రమం ఉండటంతో.. అరటి గెల తీసుకొద్దామని తోటకు వెళ్లారు. అరటి గెలపై విద్యుత్ తీగలు ఉండటాన్ని గమనించకపోవడంతో ప్రమాదం. మృతుల్లో భార్యాభర్తలు.
Samayam Telugu 3 Feb 2019, 4:35 pm
ప్రధానాంశాలు:
- అరటి గెలలు కోస్తుండగా ప్రమాదం
- మృతుల్లో భార్యాభర్తలు కూడా ఉన్నారు
- నలుగురి మృతితో స్థానికంగా విషాదం