యాప్నగరం

మదురై రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ ఎస్సై మృతి

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ క్రైం బ్రాంచ్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తోన్న రఘుతోపాటు ఆయన సోదరుడు, మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

TNN 19 Dec 2017, 10:54 am
తమిళనాడులోని మదురై సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ క్రైం బ్రాంచ్‌లో పనిచేస్తోన్న ఎస్సై రఘు, ఆయన సోదరుడు రాంప్రసాద్‌తోపాటు ఆయన మిత్రులు ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో సుబ్బారాయుడు అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అయ్యప్పస్వామి దర్శనానికి కారులో వెళ్తూ తమిళనాడులోని తిరుమంగళం సమీపంలోని విరుధ్‌నగర్- మదురై జాతీయ రహదారిపై అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకుపోవడంతో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ దుర్ఘటనలో ఎస్సై రఘుతోపాటు ఆయన సోదరుడు, కానిస్టేబుల్‌ రాంప్రసాద్‌, మిత్రుడు మధుసూదన్‌రెడ్డి, డ్రైవర్‌ మహేష్‌ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
Samayam Telugu four from andhra pradesh killed in road accident near tirumangalam
మదురై రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ ఎస్సై మృతి


గాయపడిన వ్యక్తి అనంతపురానికి చెందిన సుబ్బారాయుడిగా గుర్తించామని విరుధ్‌నగర్ ఎస్పీ ఎం రాజరంజన్ తెలిపారు. మలుపు వద్ద వేగం ప్రయాణిస్తోన్న వాహానాన్ని డ్రైవరు అదుపు చేయలేకపోవడంతో కల్వర్టుకు ఢీకొని రోడ్డు అవతలివైపు పల్టీలు కొట్టి చెరువులోకి దూసుకుపోయింది. దీంతో వాహనం సుమారు 20 అడుగుల లోతులో కూరుకుపోయింది. మృతదేహాలను తిరుమంగళం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. గాయపడిన వ్యక్తిని వైద్యం కోసం మదురైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.


అనంతపురం జిల్లా పామిడిలోని బొడ్డురాయివీధికి చెందిన రఘు, రాంప్రసాద్‌లు అయ్యప్పస్వామి దర్శనానికి శనివారం ఉదయం పామిడి నుంచి తన మిత్రులు మధుసూదన్‌రెడ్డి, సుబ్బరాయుడుతో కలిసి సొంత వాహనంలో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మధురై సమీపంలోని మరవన్‌కుళం వద్ద సోమవారం రాత్రి అదుపుతప్పి లోయలో పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.