యాప్నగరం

Kurnool: ఇద్దరు పిల్లలతో సహా ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య

తమ ఇద్దరు పిల్లలతో సహా ఉరేసుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో మంగళవారం రాత్రి సంభవించింది.

Samayam Telugu 20 Mar 2019, 11:28 am
కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తమ ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంభవించింది. నందికొట్కూరు పట్టణం బుడగ జంగం కాలనీకి చెందిన జంగాల రుద్రాక్ష రామాంజనేయులు (35), ఆయన భార్య వసంత (32) ఏడేళ్ల కుమార్తె రామలక్ష్మీ, ఐదేళ్ల కుమారుడు రాజేశ్‌తో సహా మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ఉదయం వారు ఇంటి నుంచి ఎప్పటికీ బయటకు రాకపోవడంతో పక్కంటివారికి అనుమానం వచ్చి పిలిచారు. వారు ఎంతగా పిలిచినా తలుపు తెరవకపోవడంతో కిటికీలో నుంచి చూడగా ఆంజనేయులు, వసంత వేలాడుతూ కనిపించారు. దీంతో ఇరుగుపొరుగువారు తలుపులు బలవంతంగా తెరిచి లోనికి వెళ్లి చూసేసరికి వారు అప్పటికే మృతిచెందారు. ఆ పక్కనే చిన్నారులు విగత జీవులుగా పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను కిందకు దించారు. కేసు నమోదుచేసి విచారణ చేపట్టిన పోలీసులు, మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌ కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
Samayam Telugu suicide


కుటుంబ కలహాలతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, వీరి మృతికి కారణాలు తెలియాల్సి ఉందని సీఐ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని తెలియజేశారు. వీధి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తోన్న ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని చుట్టుపక్కలవారు తెలిపారు. ఏ కష్టమొచ్చిందో కానీ ఇంతలో ఈ దారుణం చోటుచేసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.