హైదరాబాద్లో ఓ గొలుసు దొంగ వింత పని చేశాడు. ఒక మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన ఈ దొంగ గారు.. తిరిగొచ్చి పుస్తెలను ఇచ్చేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం (అక్టోబర్ 17) ఈ ఘటన జరిగింది. విజయపురికాలనీకి చెందిన అరుణ (35) కిరాణా సామాను కోసం నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్రవాహనంపై ఇద్దరు దుండగులు ఎదురుగా వచ్చారు. వాళ్లు ఒక్కసారిగా ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు.
ఆ హఠాత్పరిణామం నుంచి తేరుకునేలోపే ఓ అజ్ఞాత వ్యక్తి ఆ మహిళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆందోళనగా చూస్తున్న ఆమె చేతిలో పుస్తెలను పెట్టాడు. ఆమె విషయాన్ని పూర్తిగా గ్రహించి అరిచే లోపే.. అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు ఆ దొంగల కోసం గాలిస్తున్నారు.
తాగుడుకు బానిసైతే.. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా మెడలోని పుస్తెలు లాగేసుకొని అమ్ముకునే వ్యక్తులున్న సమాజమిది. ఇలాంటి తరుణంలో.. మాంగళ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి ఆ దొంగ చేసిన పని పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆ హఠాత్పరిణామం నుంచి తేరుకునేలోపే ఓ అజ్ఞాత వ్యక్తి ఆ మహిళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆందోళనగా చూస్తున్న ఆమె చేతిలో పుస్తెలను పెట్టాడు. ఆమె విషయాన్ని పూర్తిగా గ్రహించి అరిచే లోపే.. అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు ఆ దొంగల కోసం గాలిస్తున్నారు.
తాగుడుకు బానిసైతే.. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా మెడలోని పుస్తెలు లాగేసుకొని అమ్ముకునే వ్యక్తులున్న సమాజమిది. ఇలాంటి తరుణంలో.. మాంగళ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి ఆ దొంగ చేసిన పని పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.