యాప్నగరం

పుస్తకం వివాదంపై స్పందించిన కంచ ఐలయ్య, గద్దర్

ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులు...

TNN 12 Sep 2017, 7:35 pm
ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులు అగ్గిమీద గుగ్గిలం అయ్యేలా చేసిన సంగతి తెలిసిందే. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకుంటున్న ఆర్యవైశ్య సంఘాలు ఎక్కడికక్కడ కంచ ఐలయ్య దిష్టిబొమ్మలు దగ్ధం చేసి తమ నిరసనలు వ్యక్తంచేస్తున్నాయి. ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసి వారి గౌరవమర్యాదలు మసకబారేలా వ్యవహరించిన కంచ ఐలయ్యపై చట్టరీత్యా చర్యలు తీసుకుని ఆ పుస్తకాన్ని నిషేధించాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ డిమాండ్ చేసింది.
Samayam Telugu gaddar reacts to kancha ilaiahs samajika smugglers komatollus book controversy
పుస్తకం వివాదంపై స్పందించిన కంచ ఐలయ్య, గద్దర్


ఆర్యవైశ్యుల నుంచి తనకి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తనకి ప్రాణహాని వుందని కంచ ఐలయ్య ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులని ఆశ్రయించారు. ఈ వివాదంపై స్పందించిన కంచ ఐలయ్య ఆ పుస్తకం 2005లో రాసిన పుస్తకానికి అనువాదమని, ఈమధ్య కాలంలో పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని అన్నారు.

ఒకప్పుడు తమ పక్కకి ఎవ్వరినీ రానివ్వకుండా బడుగు బలహీనవర్గాల వారిని అంటరానివారిగా చూసిన ఆర్యవైశ్యులు ఇటీవల కాలంలో ఇతర కులాల వారిని కూడా భాగస్వాములుగా కలుపుకుని వ్యాపారం చేస్తున్నారని అన్నారు. ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు తమ సూచనలతో తనని సంప్రదిస్తే, పుస్తకంలో ప్రస్తావించిన పలు అంశాల్లో మార్పులు చేస్తామని అన్నారు.

ఇదిలావుంటే, ఈ మొత్తం వివాదంపై స్పందించిన ప్రజా గాయకుడు గద్దర్.. ప్రజాస్వామ్యంలో ఎవరి భావాలు వారు చెప్పుకునే స్వేచ్ఛ వుందని అన్నారు. కంచ ఐలయ్య రచించిన పుస్తకంపై ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టుకి వెళ్లాలి కాని బెదిరింపులకి పాల్పడటం, దాడులు చేయడం సరికాదన్నారు గద్దర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.