యాప్నగరం

రాయలసీమ హక్కులకై పోరాడతా: గద్దర్

చాలాకాలం తర్వాత ప్రజాయుద్ధనౌక గద్దర్ రాయలసీమలో పర్యటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని

Samayam Telugu 11 Jun 2017, 10:33 am
చాలాకాలం తర్వాత ప్రజాయుద్ధనౌక గద్దర్ రాయలసీమలో పర్యటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని రాయలసీమ ప్రజలు ఆదర్శంగా తీసుకుని వనరుల్లో వాటా, హక్కుల కోసం పోరాడాలని ఆయన సీమ ప్రజలకు పిలుపునిచ్చారు.‘మెజారిటీకే రాజ్యాధికారం’ పేరిట ఆదివారం కడపలో జరుగనున్న జాతీయ సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu gaddar says he will fight for rayalaseemas people
రాయలసీమ హక్కులకై పోరాడతా: గద్దర్


ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ కేంద్రంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలకులు మారారు తప్ప పాలసీలు మారలేదని ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా 90శాతం ప్రజల జీవనస్థితిగతుల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతమని పాలకుల అశ్రద్ధ వల్లే ఈ ప్రాంతం వెనుకబాటుకు గురైందన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని రాయలసీమలోని వనరుల్లో వాటా కోసం ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలు ఉద్యమించాలని పిలుపునిచ్చిన గద్దర్.. ఇక్కడి వనరుల సాధన కోసం జరిగే పోరాటానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన గొప్ప వరమని... బలహీనవర్గాలకు రాజ్యాధికారం దక్కాలంటే ఓటు శక్తిని రాజకీయ శక్తిగా మార్చాలని సూచించారు.

1973లో అజ్ఞాతంలో ఉన్నప్పుడు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందులలో గడిపానని గుర్తు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.