యాప్నగరం

గోదావరిపై జలరవాణా ప్రాజెక్ట్.. నిధుల విడుదలకు గడ్కరీ ఓకే

తెలంగాణ సర్కార్‌కు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు గోదావరి నదిపై జలరవాణాను అంతరాష్ట్ర ప్రాజెక్ట్‌గా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

Samayam Telugu 5 May 2018, 10:45 pm
తెలంగాణ సర్కార్‌కు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు గోదావరి నదిపై జలరవాణాను అంతరాష్ట్ర ప్రాజెక్ట్‌గా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో మహారాష్ట్ర-తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టుగా అంగీకారం తెలిపారు. దీనికి సంబంధించి రూ.2వేల కోట్ల నిధుల్ని కూడా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అలాగే సీతారామ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పునర్నిర్మాణ ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామని మంత్రి తుమ్మలకు చెప్పారు.
Samayam Telugu Tummala


జలరవాణా ప్రాజెక్టుకు నిధుల కేటాయించినందుకు మంత్రి తుమ్మల గడ్కరీకి కృతజ్ఞ‌తలు తెలిపారు. ఎయిర్‌పోర్టులో కేంద్రమంత్రిని కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. గడ్కరీని కలిసిన వారిలో తుమ్మలతో పాటూ ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఖమ్మం ఎంపీ శ్రీనివాస్ రెడ్డితో పాటూ పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.