యాప్నగరం

పార్లమెంట్ దగ్గర ఎవరా కుర్రాడు..

ఏపీకి విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా నినాదం ఢిల్లీలో బలంగా వినబడుతోంది. పార్లమెంట్ లోపల, వెలుపులా ఎంపీలు హోదా, హామీల అమలు నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. రోజూలాగే పార్లమెంట్ బయట టీడీపీ ఎంపీలు ప్లకార్డులతో తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈలోపు ఓ కుర్రాడు అక్కడికి వచ్చాడు. మెడలో పసుపు కండువా... ప్లకార్డు తీసుకొని ఎంపీల పక్కనే నిలబడ్డాడు. ఇంతలో అందరూ షాకయ్యారు.

Samayam Telugu 13 Mar 2018, 6:01 pm
ఏపీకి విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా నినాదం ఢిల్లీలో బలంగా వినబడుతోంది. పార్లమెంట్ లోపల, వెలుపులా ఎంపీలు హోదా, హామీల అమలు నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. రోజూలాగే పార్లమెంట్ బయట టీడీపీ ఎంపీలు ప్లకార్డులతో తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈలోపు ఓ కుర్రాడు అక్కడికి వచ్చాడు. మెడలో పసుపు కండువా... ప్లకార్డు తీసుకొని ఎంపీల పక్కనే నిలబడ్డాడు. ఇంతలో అందరూ షాకయ్యారు. ఎవరీ కుర్రాడని తీశారట... చివరికి ఎవరో చెప్తేగాని తెలియలేదు. ఇంతకీ ఎవరీ అబ్బాయనే కదా మీ డౌటు... గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సిద్ధార్థ్.
Samayam Telugu galla siddharth support for ap special status and protest with tdp mps
పార్లమెంట్ దగ్గర ఎవరా కుర్రాడు..


ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఎంపీలు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా సిద్దార్థ్ వచ్చాడు. ఎంపీలతో కలిసి ఇలా నిరసనలో పాల్గొన్నాడు. అయితే మీడియాతో సిద్దార్థ్ చిట్‌చిట్‌గా మాట్లాడాడట. తండ్రి వారసత్వాన్ని తీసుకొని రాజకీయాల్లోకి వస్తారా అని అడిగారట. తండ్రి వారసత్వం కాదు కాని... తాత, మామ వారసత్వాన్ని తీసుకొంటానని చెప్పాడట. అంటే సినిమాలంటే తనకు ఇష్టమని పరోక్షంగా చెప్పినట్లేనని అందరూ అనుకుంటున్నారు. మొత్తం మీద గల్లావారి వారసుడు పార్లమెంట్ దగ్గర హాట్ టాపిక్ అయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.