యాప్నగరం

ప్రారంభమైన శోభా యాత్ర.. ముందే బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

పది రోజుల పాటు భక్తులతో పూజంలందుకున్న గణేశుని విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. అడుగు నుంచి 50 ఎడుగులు ఎత్తున్న విగ్రహాలు సాగర్ వైపు సాగుతున్నాయి.

Samayam Telugu 23 Sep 2018, 7:52 am
హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం శోభాయాత్ర ఆదివారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైంది. పది రోజుల పాటు భక్తులతో పూజలందుకున్న గణనాధుని విగ్రహాలు గంగమ్మ చెంతకు తరలుతున్నాయి. గతానికి భిన్నంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభా యాత్ర ముందుగానే ప్రారంభమైంది. ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకునేందుకు ఈ ఏడాది కూడా లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాధుడు 57 అడుగుల ఎత్తులో సప్తముఖ కాళసర్ప మహాగణపతిగా కొలువుదీరాడు. ఆదివారం మధ్యాహ్నానికే గణపతి నిమజ్జనం పూర్తిచేసేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. సాధ్యమైనంత ముందుగానే ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్న సంకల్పంతో భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ, జీహెచ్ఎంసీ, పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు.
Samayam Telugu ఖైరతాబాద్ మహాగణపతి


శనివారం మధ్యాహ్నం వరకే దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ప్రకటించినా, ఎన్నడూ లేనివిధంగా జన ప్రవాహం తరలివచ్చింది. దీంతో ఆ నిర్ణయాన్ని విరమించుకుని భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి 11 గంటల సమయానికి విగ్రహం చుట్టూ ఉన్న అలంకరణతొలగించి, ఆపై 12 గంటలకల్లా, వెల్డింగ్ పనులను ప్రారంభించారు. ఒంటిగంట నుంచి భక్తుల దర్శనాలను నిలిపివేశారు. విజయవాడ నుంచి తెచ్చిన భారీ వాహనంపై ప్రత్యేక క్రేన్ సాయంతో విగ్రహాన్ని ఎక్కించే పనులు ఉదయం 6 గంటలకల్లా పూర్తయింది.

ఖైరతాబాద్ గణనాయకుని శోభాయాత్ర, లక్డీకపూల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియేట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ లోకి ప్రవేశించనుండగా, ఈ మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట మధ్య నిమజ్జనం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాగణపతి నిమజ్జనం కోసమే ప్రత్యేకంగా 3 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటుచేశారు. ఈ శోభాయాత్ర జరిగే మార్గంలో 40 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లో మొత్తం 25 వేల మంది పోలీసులను మొహరించారు. నిమజ్జనం ఆర్టీసీ 550 బస్సులు, రైల్వే శాఖ అదనంగా 8 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.