Ganesh Nimajjanam: కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం.. ట్రాఫిక్కు అంతరాయం
నిమజ్జనం జరిగే ట్యాంక్బండ్ నుంచి అబిడ్స్ వరకు.. ట్యాంక్బండ్ నుంచి నారాయణగూడ ఫ్లైఓవర్ వరకు వినాయక విగ్రహాలు బారులు తీరాయి.
Samayam Telugu 24 Sep 2018, 1:05 pm
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం సోమవారం కూడా కొనసాగుతూనే ఉంది. నిమజ్జనం జరిగే ట్యాంక్బండ్ నుంచి అబిడ్స్, నారాయణగూడ మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు విఘాతం కలుగుతోంది. ఆదివారం ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ గణపతి నిమజ్జనాలు పూర్తయ్యాకా.. మిగిలిన విగ్రహాల నిమజ్జనాలు మరింత జోరందుకున్నాయి. అయితే రాత్రి వర్షం కురవడంతో ట్యాంక్ బండ్కు గణనాథుల రాక ఆలస్యమైంది. దీంతో సోమవారం కూడా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.
విగ్రహాలు ట్యాంక్బండ్కు భారీగా తరలివస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం దాదాపు 30 వేళ పోలీసులను రంగంలోకి దింపింది. సోమవారం సాయంత్రం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది.
విగ్రహాలు ట్యాంక్బండ్కు భారీగా తరలివస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం దాదాపు 30 వేళ పోలీసులను రంగంలోకి దింపింది. సోమవారం సాయంత్రం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది.