తెలంగాణలోని గంగదేవిపల్లి మరో ఘనతను సాధించింది. వందశాతం పారిశుద్ధ్యం పాటిస్తూ గ్రామాస్థులు దేశానికి ఆదర్శంగా నిలిచారని కేంద్ర తాగునీటి పారిశుద్ధశాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ అభినందించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిలో ఆయన బృందం శనివారం పర్యటించింది. అయ్యర్ వెంట 40 మంది ఉన్నారు.
గంగదేవిపల్లిలో వినూత్నంగా నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. ‘‘రెండు గుంతల విధానంతో ప్రతి మరుగుదొడ్డి నుంచి సేంద్రియ ఎరువు తయారవుతోంది. సారవంతమైన ఎరువును పంటలపై ప్రయోగిస్తే సత్ఫలితాలు వచ్చాయని’’ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇదే విధానాన్ని మిగతా రాష్ట్రాల్లోనూ ప్రయోగించడానికి నమునాలు తీసుకెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరుగుదొడ్ల గుంతల్లోకి దిగి ఎరువుగా మారిన మలాన్ని బయటకు తీసిన అయ్యర్ బృందం పరిశీలించింది.
స్వేచ్ఛ అనే ఎన్జీవో సంస్థ గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైఫై సౌకర్యాన్ని అయ్యర్ ప్రారంభించారు.
గంగదేవిపల్లిలో వినూత్నంగా నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. ‘‘రెండు గుంతల విధానంతో ప్రతి మరుగుదొడ్డి నుంచి సేంద్రియ ఎరువు తయారవుతోంది. సారవంతమైన ఎరువును పంటలపై ప్రయోగిస్తే సత్ఫలితాలు వచ్చాయని’’ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇదే విధానాన్ని మిగతా రాష్ట్రాల్లోనూ ప్రయోగించడానికి నమునాలు తీసుకెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరుగుదొడ్ల గుంతల్లోకి దిగి ఎరువుగా మారిన మలాన్ని బయటకు తీసిన అయ్యర్ బృందం పరిశీలించింది.
స్వేచ్ఛ అనే ఎన్జీవో సంస్థ గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైఫై సౌకర్యాన్ని అయ్యర్ ప్రారంభించారు.